AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరంగల్‌ ఎంజీఎం వద్ద దారుణం.. నవజాత శిశువును పీక్కుతిన్న కుక్కలు..!

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి వద్ద శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఎంజీఎం వద్ద కుక్కలు నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువును పీక్కుతిన్నాయి. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులతో పాటు అక్కడే ఉన్న రోగుల బంధువులు కుక్కలను చెదరగొట్టారు. ఎంజీఎం క్యాజువాలిటీ ఎదుట ఈ ఘటన చోటు చేసుకున్నది. కుక్కలు దాదాపు శిశువు సగ భాగాన్ని తినేశాయి. ఆ తర్వాత శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఎంజీఎం మార్చూరిలో భద్రపరిచారు. అయితే, శిశువు మగనా.. ఆడనే అనే విషయం తెలియరాలేదు. శిశువు ఆనవాళ్లు గుర్తించడం కష్టంగా మారింది.

శిశువును కుక్కలు ఎక్కడి నుంచి తీసుకువచ్చాయా? ఎవరైనా శిశువు మృతదేహాన్ని పడేసి వెళ్లారా? అనేది తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిశువును ఎవరు పడేసి వెళ్లారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని సైతం పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10