ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బ్యాడ్మింటన్ గ్రూప్ దశలో భారీ విజయం సాధించి తరువాతి రౌండ్ కు చేరుకుంది. ఈరోజు జరిగిన బ్యాడ్మింటన్ గ్రూప్ దశ పోటీల్లో మాల్దీవులకు చెందిన నబా అబ్ధుల్ రజాక్పై అలవోకగా గెలిచిన సింధు తన ఫామ్ చాటుకుంది. రజాక్ పై 21-9, 21-6 తేడాతో పీవీ సింధు వరుస సెట్లలో విజయం సాధించింది. గ్రూప్ దశలో తన తొలి మ్యాచ్లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబా అబ్దుల్ రజాక్ను సింధు కేవలం 29 నిమిషాల్లోనే ఓడించింది.
బ్యాడ్మింటన్తో పాటు ఈరోజు భారత క్రీడాకారులు షూటింగ్, రోయింగ్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్లలో పాల్గొననున్నారు. ఈ సమయంలో, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో స్వర్ణ పతకానికి వెళ్లనున్న మను భాకర్పై అందరి దృష్టి ఉంది. రోయింగ్ పురుషుల సింగిల్స్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచిన బల్రాజ్ పవార్ నేడు రిపీచేజ్ మ్యాచ్ ఆడనున్నాడు.
ఆదివారం టేబుల్ టెన్నిస్లో భారత ఆటగాళ్లు 3 మ్యాచ్లు ఆడనున్నారు. మొదట, మధ్యాహ్నం 2:15 గంటల నుంచి జరిగే మహిళల రౌండ్ ఆఫ్ 64 మ్యాచ్లో శ్రీజ అకుల స్వీడన్కు చెందిన క్రిస్టినా కోల్బెర్గ్తో తలపడనుంది. దీని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు స్లోవేనియాకు చెందిన డాని కోజుల్తో శరత్ కమల్ ఆడనున్నాడు. ఇది కూడా రౌండ్ ఆఫ్ 64 మ్యాచ్ అవుతుంది. టేబుల్ టెన్నిస్ స్టార్ మానికా బాత్రా సాయంత్రం 4:30 గంటలకు వేల్స్కు చెందిన అన్నా హెర్సీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా రౌండ్ ఆఫ్ 64గా ఉంటుంది.