AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విశాఖ శారదా పీఠాధిపతికి భద్రతను కుదించిన ప్రభుత్వం

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భద్రతను ఏపీ ప్రభుత్వం కుదించింది. వ్యక్తిగత భద్రత కోసం ఒక్క పోలీస్ మినహా మిగతా వారందరినీ ప్రభుత్వం తొలగించింది. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి పూర్తిగా భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.

అయితే, గత ప్రభుత్వంలో శారదాపీఠం స్వామీజీకి సెక్యూరిటీ నిమిత్తం 2+2 గన్ మెన్, ఎస్కార్ట్ వాహనంతోపాటు 15 మందికి పైగా సిబ్బంది పీఠం వద్ద విధులు నిర్వహించేవారు. స్వామీజీ బయటకు వచ్చినప్పుడు ఎస్కార్ట్ వాహనం ద్వారా ట్రాఫిక్ నియంత్రించేవారు. అదేవిధంగా నిరంతరం పహారా కోసం శారదాపీఠం ప్రవేశద్వారా వద్దే మూడు షిఫ్ట్ లు కలిపి 15 మంది విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం స్వరూపానందేంద్రకు కేవలం ఒక వ్యక్తిగత భద్రతా సిబ్బంది మినహా మిగతా వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10