AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మిస్టరీ.. ఒకే కుటుంబంలోని ముగ్గురు అనుమానాస్పద మృతి

హైదరాబాద్: నగరంలోని సనత్‌​నగర్​‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్​బాత్​రూంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సనత్‌​నగర్​జెక్​కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్టుమెంట్​రెండో అంతస్తులోని ఫ్లాట్‌​లో ఈ ముగ్గురి మృతదేహాలు ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సనత్​‌నగర్‌​లో జెక్​కాలనీలోని అపార్టుమెంట్​లో ఆర్.వెంకటేశ్​(55), మాధవి(50), హరి(30) నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చినప్పుడు ఎవరూ కనిపించలేదు. దీంతో బాత్​రూమ్​‌లో ఉన్నారేమోననుకుని ఇంట్లో పనిచేసి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 3 గంటల సమయంలో వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఎవరూ కనిపించలేదు.

ఈ నేపథ్యంలో అనుమానం వచ్చి బాత్​రూమ్​వైపు చూడగా డోర్​లాక్​చేసి ఉంది. అనుమానంతో స్థానికులకు సమాచారం అందించగా అపార్ట్​మెంట్​వాచ్​‌మెన్​డోర్​పగులుగొట్టి చూశాడు. అప్పటికే ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే అపార్ట్​మెంట్​నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. తొలుత విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు పోలీసులు భావించారు. కానీ, అలాంటి ఆనవాళ్లు ఏవీ లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత క్లూస్​టీమ్​సాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10