హైదరాబాద్: నగరంలోని సనత్నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్బాత్రూంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సనత్నగర్జెక్కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్టుమెంట్రెండో అంతస్తులోని ఫ్లాట్లో ఈ ముగ్గురి మృతదేహాలు ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సనత్నగర్లో జెక్కాలనీలోని అపార్టుమెంట్లో ఆర్.వెంకటేశ్(55), మాధవి(50), హరి(30) నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చినప్పుడు ఎవరూ కనిపించలేదు. దీంతో బాత్రూమ్లో ఉన్నారేమోననుకుని ఇంట్లో పనిచేసి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 3 గంటల సమయంలో వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఎవరూ కనిపించలేదు.
ఈ నేపథ్యంలో అనుమానం వచ్చి బాత్రూమ్వైపు చూడగా డోర్లాక్చేసి ఉంది. అనుమానంతో స్థానికులకు సమాచారం అందించగా అపార్ట్మెంట్వాచ్మెన్డోర్పగులుగొట్టి చూశాడు. అప్పటికే ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే అపార్ట్మెంట్నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. తొలుత విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు పోలీసులు భావించారు. కానీ, అలాంటి ఆనవాళ్లు ఏవీ లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత క్లూస్టీమ్సాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.