హనుమకొండ కలెక్టరేట్లో రైతుభరోసాపై అవగాహన సదస్సు
పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
(అమ్మన్యూస్, హనుమకొండ):
ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన రైతు భరోసా పథకం అవగాహన సదస్సుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. అలాగే మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, సీతక్క.. 12 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఎంపీ రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. రైతు భరోసా విధివిధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
నిధులు దుర్వినియోగం చేయబోం..
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక మైన హామీలను నెరవేర్చిందన్నారు. మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి.. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామన్నారు. అడ్డుగోలుగా వాటిని దుర్వినియోగం చేయబోమని తెలిపారు.
గత రైతు బంధులో అక్రమాలు..: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధులో అక్రమాలు జరిగాయని మంత్రి సీతక్క అన్నారు. నిజానికి వ్యవసాయం చేసిన రైతులకు కాకుండా పట్టాలు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు గతంలో ఇచ్చారన్నారు. పట్ట బంధు గానే మారిందన్నారు. 40 ఏళ్ల క్రితం భూము అమ్ముకొని పేరు మరకపోవడం తో సాగు చేసే రైతులకు పెట్టు బడి రాలేదన్నారు. ఈ లాంటి సదస్సులో గతంలో జరిగిన లోపాలను సరి చేసి నిజమైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సదస్సు మంచి వచ్చే సూచనతో రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రైతు బంధు పథకం లో భూస్వాములకు కాకుండా నిజమైన రైతులకు ఇవ్వాలని తెలిపారు. గత ప్రభుత్వం హయం లో భూస్వాములు లక్షల రూపాయలు పొందారన్నారు. నిజమైన రైతులకు ఆందాల్సిన పెట్టుబడి సహాయం ఆడలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో రైతులకు సబ్సిడీలు అందాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగిందన్నారు. పశువులకు కూడా ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. పశువులు చనిపోతే రైతులకు నష్టం జరుగుతోందని తెలిపారు.