AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పూరీలో 46 ఏళ్ల తరువాత తెరుచుకున్న రత్నభాండాగారం

లోపలికి వెళ్లిన బృందం
ఆభరణాల లెక్కింపునకు పట్టే సమయం 72 రోజులు

(అమ్మన్యూస్, పూరీ):
ఒడిశా రాష్ట్రం పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరచుకుంది. ఆలయ పూజారులు ప్రత్యేక పూజల అనంతరం రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. ఈ రత్నభాండాగారాన్ని ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. మూడో గదిలోకి 11 మందితో కూడిన ఒక బృందం వెళ్లింది. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకొచ్చేందుకు ఆరు భారీ పెట్టెలను భాండాగారంలోకి తీసుకెళ్లారు. ఈ పూరీ రత్నభాండాగారంలో మొత్తం మూడు గదులున్నాయి. వాటిలో మొదటి గదిని స్వామి వారికి పూజలో భాగంగా ప్రతీ రోజు తీస్తారు. ఇక రెండో గదిని అతి ముఖ్య సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు.

ఆ యా రోజుల్లో స్వామి వారికి ఆ గదిలోని విలువైన నగలను అలంకరిస్తారు. అయితే మూడో గదిని మాత్రం 46 ఏళ్ల క్రితం తెరిచారు. అంటే.. ఈ గదిని 1978లో తెరిచారు. అనంతరం మళ్లీ తెరవలేదు. దీంతో ఆ గదిలో అంతులేని సంపద ఉందని తెలుస్తుంది. ఈ గదికి నాగ బంధం కూడా ఉండడంతో.. అన్ని రక్షణ చర్యలు తీసుకున్నారు. ఇక ఆ గదిలో నిధులు, నిక్షేపాలకు రక్షణగా పాములున్నాయని సమాచారం.

పాములు పట్టే వ్యక్తులు సైతం..
బృందంలో పాములు పట్టే వ్యక్తులు ఉన్నారు. అలాగే ఎలాంటి అత్యవసర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు వైద్యులను కూడా అందుబాటులో ఉంచారు. రత్నభాండాగారం తెరిచే ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆ యా పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

72 రోజులు పట్టే సమయం..
రత్నభాండాగారంలోని సంపదను ఆ యా పెట్టెల్లో కమిటీ సభ్యులు భద్రపరచనున్నారు. అందుకోసం ఆ పెట్టలను భాండాగారంలోకి తీసుకు వెళ్లారు. అలాగే ఆ యా ఆభరణాలను డిజిటల్‌ డాక్యుమెంటేషన్‌ చేసి.. అనంతరం వాటిని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. 1978లో ఈ భాండాగారంలో సంపదను లెక్కించేందుకు 72 రోజుల సమయం పట్టిందని సమాచారం.

1978లో చివరిసారిగా..
భాండాగారం చివరిసారిగా 1978 లో ఓపెన్‌ చేయగా.. సంపదను లెక్కించేందుకు అప్పుడు 70 రోజులు పట్టింది. నాటి జాబితా ప్రకారం సీక్రెట్‌ రూమ్లో 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండి వీటితో పాటు విలువైన రాళ్లు, బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10