AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోహా లో కేసీఆర్ కు ఘన స్వాగతం

మహారాష్ట్ర లోని కాందార్ లోహా లో మరి కొద్దిసేపటి లో జరగనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. దీనికోసం ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బేగపేట కు వెళ్లారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాఫ్టర్‌ లో. లోహా లో లాండ్ అయ్యారు. అనంతరం కెసిఆర్ బీఆర్‌ఎస్‌ అభిమాని ఇంట్లో తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌ లో బయలుదేరి బైల్‌ బజార్‌ సభాప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సభలో ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్. కాగా లోహ హెలిప్యాడ్ వద్ద పెద్ద సంఖ్యలో నేతలు స్వాగతం పలికారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10