AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్టీసీని బలోపేతం చేస్తాం .. మంత్రి పొన్నం ప్రభాకర్‌

బస్సుల సంఖ్య పెంచుతున్నాం
వెయ్యి బస్సులు కొనుగోలు చేశాం
మరో 1500 బస్సులకు ఆర్డర్‌ ఇచ్చాం
– రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌
– నల్గొండలో మంత్రి కోమటిరెడ్డితో కలిసి ఏసీ, డీలక్స్‌ బస్సుల ప్రారంభం

(అమ్మన్యూస్, నల్లగొండ):
ఆర్టీసీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ–హైదరాబాద్‌ నాన్‌స్టాప్‌ ఏసీ, 3 డీలక్స్‌ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ… ఇప్పటికే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామని, మరో 1,500 బస్సుల కోసం ఆర్డర్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా ప్రాంతాలకు బస్సుల సంఖ్యను పెంచుతున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామని గుర్తు చేశారు. రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన రూ.200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తామని తెలిపారు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. త్వరలో నల్గొండ జిల్లాకు మరిన్ని బస్సులు తెస్తామన్నారు. కొత్త బస్సుల్లో నల్గొండకు 100 కేటాయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోమటిరెడ్ది కోరారు.

ANN TOP 10