AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు – సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ సమీక్ష

– హాజరైన ప్రభుత్వ విప్‌లు, సీఎస్, డీజీపీ, అధికారులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్‌ లు, సీఎస్, డీజీపీ, అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రైతు భరోసా విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తోంది. ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్‌ ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అలాగే జాబ్‌ క్యాలెండర్‌ ను సైతం ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. గతంలో అసెంబ్లీ సమావేశాలు హాజరు కానీ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సమావేశాలు కేసీఆర్‌ హాజరవుతారా లేదా అనే ఆసక్తి నెలకొంది.

ANN TOP 10