AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం.. ప్రదానం చేసిన పుతిన్

రష్యాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ పురస్కారం అందించిన రష్యా ప్రభుత్వం

రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి విశిష్ట ఘనత లభించింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. రష్యా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ, బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత అవార్డును అందించినట్టు పుతిన్ పేర్కొన్నారు.

దీనిపై మోదీ స్పందించారు. తనకు రష్యా ప్రభుత్వం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారం అందించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. రష్యా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ అవార్డును నా దేశ 140 కోట్ల మంది ప్రజలకు అంకితం ఇస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10