AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎర్రబెల్లి దయాకర్ రావుపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించిన నాటి నుంచి ఈ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ‘‘ఆయన రాడు .. వచ్చిన చేర్చుకోబోం. హైప్ కోసం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఆయనకు అలవాటే’’ అని కొండా సురేఖా వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యాటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షణ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. వరంగల్ పాత మాస్టర్ ప్లాన్‌ను మార్చాల్సిన అవసరాన్ని, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్‌ను ఇండస్ట్రియల్ కారిడార్‌గా మార్చి… ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని చూస్తున్నారని, దశలవారీగా వరంగల్ అభివృద్ధి చేస్తామని కొండా సురేఖ చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10