నగరంలో ఘటన
ఇద్దరిదీ ప్రేమ వివాహమే..
ఉస్మానియాలో క్లాస్మేట్స్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య కలకలంరేపింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ అల్వాల్లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఈ ఘటన జరిగింది. ఆమె ఇంట్లో ఉరి వేసుకున్నారు. ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న ఈమె.. రెండు రోజులుగా స్కూల్కు కూడా వెళ్లలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే కుటుంబం, బంధువులు.. ఇటీవల పుణ్యక్షేత్రాలకు సైతం వెళ్లొచ్చారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. ఆమె రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే సత్యం ఉదయమే నియోజకవర్గానికి వెళ్లగా.. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారని సమాచారం. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం కుటుంబం బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారని చెబుతున్నారు. ఇంతలోనే ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం అర్ధరాత్రి తరువాత బయటకు వచ్చింది.
మేడిపల్లి సత్యం, రూపాదేవిలు ఉస్మానియా యూనివర్శిటీలో క్లాస్మేట్స్ అని తెలుస్తోంది.. వారిద్దరు 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకోగా.. బాబు, పాప సంతానం. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే రూపాదేవి ఆత్మహత్యకు ముందు భర్త మేడిపల్లి సత్యంకు వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.