తెలంగాణ పోలీసులు అరుదైన ఘనత సాధించారు. విధుల్లో నిబద్ధత, వృత్తిపట్ల ఉన్న కమిట్ మెంట్.. చురుకుదనం లాంటి లక్షణాలతో సూపర్ పోలీస్ అనిపించుకోనున్నారు. ఈ క్రమంలోనే.. ఐక్యరాజ్య సమితి ద్వారా వివిధ దేశాల్లో నియమించే పీఎస్ కమిషన్ శాంతి భద్రతల విధులు నిర్వహించేందుకు తెలంగాణ పోలీసు శాఖకు చెందిన అధికారులు ఎంపికై అందరి చేత సూపర్ అనిపించుకుంటున్నారు. అయితే.. ఇందుకు సంబంధించిన పరీక్షలకు మొత్తం 22 మంది తెలంగాణ పోలీసులు హాజరవగా.. 19 మంది అధికారులు ఎంపికవటం విశేషం. ఈ పరీక్షల్లో సెలెక్ట్ అయిన పోలీస్ అధికారులు.. అంతర్గత భద్రత లోపించి శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా ఉన్న దేశాల్లో ఈ అధికారులు ఏడాది పాటు విధులు నిర్వహించి అక్కడ శాంతి సామరస్యాలు నెలకొల్పేందుకు తమవంతు పాత్ర పోషించనున్నారు.
కాగా.. న్యూ యార్క్ నుంచి వచ్చిన పోలీసు అధికారులు ఢిల్లీలో జూన్ 6 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇంగ్లీష్తో పాటు డ్రైవింగ్, ఫైరింగ్ వంటి అంశాల్లో పోలీసులకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో దేశవ్యాప్తంగా 225 హాజరవగా.. అందులో 164 మంది ఉత్తీర్ణులవటం గమనార్హం. ఇందులో 19 మంది అధికారులు తెలంగాణవాళ్లే ఉండటం గర్వకారణం. దీంతో.. తెలంగాణ పోలీసు శాఖకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రానుంది.
ఎంపికైన తెలంగాణ పోలీసు అధికారులు వీళ్లే..
అలెక్స్, కమాండెంట్
దేవేందర్ సింగ్, ఎస్పీ
నర్సింగ్ రావు డీఎస్పీ, యాంటీ నార్కోటిక్ బ్యూరో
చల్లా శ్రీధర్, డీఎస్పీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో
కే.ఎం.కిరణ్ కుమార్, ఏసీబీ, హైదరాబాద్ సీసీఎస్
ప్రతాప్, డీఎస్పీ విజిలెన్స్ విభాగం
శ్రీధర్ రెడ్డి, డీఎస్పీ, కోదాడ
మాజిద్ అలీ ఖాన్, ఏసీపీ
జూపల్లి రమేశ్, ఏసీపీ
సురేశ్, ఇన్స్పెక్టర్, సైబరాబాద్
విజయ్ కుమార్, సీఐడీ, ఇన్స్పెక్టర్
శ్రీనివాసులు, హెడ్ కానిస్టెబుల్
యాదగిరి, హెడ్ కానిస్టెబుల్, అలేరు పీఎస్