ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గంపై చంద్రబాబు వ్యూహంపై చర్చ జరుగుతోంది.. కొత్తగా మంత్రులైన వారిలో ఎక్కువమంది కొత్తవాళ్లు ఉండటం చర్చనీయాంశమైంది. చంద్రబాబు కేబినెట్లో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు. అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి, కొత్తగా ఎన్నికైన సవితకు కూడా మంత్రి పదవులు దక్కాయి.
కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరి నాలుగు పదవులు దక్కాయి. కాపుల్లో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్, దుర్గేష్ ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్కు.. రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి, ఎం.రాంప్రసాద్రెడ్డికి అవకాశం దక్కింది. ఎస్సీ కోటాలో డోలా బాలవీరాంజనేయస్వామి, వంగలపూడి అనిత, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఆర్య వైశ్య వర్గం తరఫున టీజీ భరత్కు కేబినెట్లో స్థానాలు దక్కాయి. ఉమ్మడి జిల్లాలవారీగా మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మంత్రి జిల్లా, నియోజకవర్గం
నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి) చిత్తూరు జిల్లా (కుప్పం)
పవన్ కళ్యాణ్ (ఉప ముఖ్యమంత్రి) తూర్పుగోదావరి జిల్లా ( పిఠాపురం)
మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కడప జిల్లా (రాయచోటి)
పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా (ఉరవకొండ)
సవితమ్మ అనంతపురం జిల్లా (పెనుకొండ)
సత్యకుమార్ (బీజేపీ) అనంతపురం జిల్లా (ధర్మవరం)
ఎన్.ఎమ్.డి.ఫరూక్ కర్నూలు జిల్లా (నంద్యాల)
బీసీ జనార్థన్ రెడ్డి కర్నూలు జిల్లా (బనగానపల్లి)
టీజీ భరత్ కర్నూలు జిల్లా (కర్నూలు)
పొంగూరు నారాయణ నెల్లూరు జిల్లా (నెల్లూరు సిటీ)
ఆనం రాంనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా (ఆత్మకూరు)
డోలా బాలవీరాంజనేయస్వామి ప్రకాశం జిల్లా (కొండేపి)
గొట్టిపాటి రవి కుమార్ ప్రకాశం జిల్లా (అద్దంకి)
నాదెండ్ల మనోహర్ (జనసేన పార్టీ) గుంటూరు జిల్లా (తెనాలి)
అనగాని సత్యప్రసాద్ గుంటూరు జిల్లా (రేపల్లె)
నారా లోకేష్ గుంటూరు జిల్లా (మంగళగిరి)
కొలుసు పార్థసారధి కృష్ణా జిల్లా (నూజివీడు)
కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా (మచిలీపట్నం)
నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా (పాలకొల్లు)
కందుల దుర్గేష్ (జనసేన పార్టీ) పశ్చిమ గోదావరి జిల్లా (నిడదవోలు)
వాసంశెట్టి సుభాష్ తూర్పుగోదావరి జిల్లా (రామచంద్రాపురం)
వంగలపూడి అనిత విశాఖపట్నం (పాయకరావుపేట)
గుమ్మడి సంధ్యారాణి విజయనగరం జిల్లా (సాలూరు)
కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా (గజపతినగరం)
కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా (టెక్కలి)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 సీట్లు ఉండగా మంత్రివర్గంలో 25 మంది మంత్రులను తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మంత్రివర్గంలో.. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించినట్లు లెక్క. దీనిని బట్టి 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేన పార్టీ మూడు, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒకటి.. 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి జిల్లాలవారీగా లెక్క చూస్తే.. గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా మూడేసి మంత్రిపదవులు దక్కాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి మంత్రి పదవులు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికీ అవకాశం దక్కలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలనుంచి కూడా ఒక్కొక్కరికే చాన్సు దక్కింది. అయితే శాసనమండలి నుంచి ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు.