AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియాగాంధీ దూరం.. తెలంగాణ పర్యటన రద్దు..

డాక్టర్‌ సలహా మేరకు నిర్ణయం
ఏఐసీసీ వెల్లడి

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. తెలంగాణ దశాబ్ది వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ తెలిపింది. అనారోగ్యం కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు పేర్కొంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఢిల్లికి వెళ్లి ముఖ్య అతిథిగా రావాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానించిన విషయం విదితమే.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా వస్తారా? రారా? అంతకంటే ముందే ఈ అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సోనియా ఆహ్వానాన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. అయితే తెలంగాణ దేవత అయిన సోనియాను ఎందుకు ఆహ్వానించకూడదని ప్రశ్నించారు అధికార పార్టీ నేతలు. చివరికి ఆమె వ్యక్తిగత కారణాలతో సోనియా గాందీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది.

జూన్‌ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెట్టి సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వలో జరిగిన భేటీలో కేబినెట్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించారు సీఎం రేవంత్‌ రెడ్డి. అయితే ఈ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ తెలిపింది. అనారోగ్యం కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు పేర్కొంది. కాగా, షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం సోనియా గాంధీ తెలంగాణకు రావాల్సి ఉంది. వైద్యుల సూచన మేరకు తెలంగాణ పర్యటనకు రాలేకపోతున్నట్లు వెల్లడించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10