AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రైవేటు స్కూళ్లలో స్టేషనరీ నిషేదం!

హైదరాబాద్ డీఈవో రోహిణి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు స్కూళ్లలో యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ డీఈవో రోహిణి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే స్టేషనరీ, పుస్తకాల వంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని సూచించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హచ్చరించారు. హైదరాబాద్‌ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల (రాష్ట్ర, సీబీఎస్సీ, ఐసీఎస్సీ) ప్రాంగణాల్లో యూనిఫారాలు, షూస్‌, బెల్ట్‌ అమ్మడానికి వీల్లేదని పేర్కొన్నారు. ప్రవేట్ పాఠశాలల నిరంతర పర్యవేక్షణకు మండల స్థాయి కమిటీ చేయాలని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్‌లో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే.. అవి వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని ఆదేశించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10