AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రిగా చూసి కొందరు ఓర్వలేకపోతున్నారు: సీతక్క

ఆదివాసీ బిడ్డాపైన తనను మంత్రిగా చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని మంత్రి సీతక్క అన్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారని మండిపడ్డారు. శుక్రవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా మంచెర్లలో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. పెంపుడు మనుషులను పెట్టుకుని బీఆర్ఎస్ వాళ్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి పంపిందని, వందల కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు నన్ను ఎమ్మెల్యేగా గెలవకుండా చేయాలని ప్రయత్నం చేశారన్నారు. ఈరోజు తీన్మార్ మల్లన్నపై కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. మొదటి విడుతగా సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ప్రోత్సాహకంగా ప్రకటించామని తెలిపారు. దొడ్డు వడ్లను కొనమని ఏ ఒక్క సందర్భంలో అనలేదని స్పష్టం చేశారు. తినడానికి ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడమే తమ లక్ష్యమని, ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫస్ట్ తారీకు రాగానే అందరికీ జీతాలు ఇస్తున్నామని, రైతుల సమస్యలను, నిరుద్యోగుల సమస్యలు ప్రతి ఒక్కటి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క చెప్పారు.

ANN TOP 10