ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.50 లక్షలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లాలోని జిల్లెల గూడెంకు చెందిన వ్యక్తి యస్ కిరణ్ ఫిర్యాదు చేశారు. తనకు ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇస్తానని డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనకు రూ.30 లక్షలు ఆన్ లైన్ ద్వారా పంపించానని, మిగిలిన రూ.20 లక్షలు పలు దఫాలుగా నగదు రూపంలో ఇచ్చానని పేర్కొన్నారు. కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
