ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో ఈసారి పోలింగ్ శాతం భారీగానే నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఏపీ పోలింగ్ శాతంపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా కాసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయినట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు.
మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వచ్చి 6 లోపు క్యూలైన్లో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో ఆయా ప్రాంతాల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో ఈసారి పోలింగ్ శాతం భారీగానే నమోదు అయ్యింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయినట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 79.88 శాతం పోలింగ్ నమోదు అవగా.. 2014 ఎన్నికల్లో 77.96శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
అత్యధికంగా ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో 87.06 పోలింగ్ శాతం నమోదు అయ్యింది. ఇక రెండవ స్థానంలో చిత్తూరు జిల్లా నిలవగా.. అక్కడ 85.77 పోలింగ్ శాతం నమోదు అయ్యింది. అలాగే మూడవ స్థానంలో 85.48 శాతం ఓట్లతో బాపట్ల నిలిచింది. అయితే అత్యల్పంగా విశాఖపట్నంలో 71. 11 పోలింగ్ శాతం నమోదు అయినట్లు ట్విట్టర్ వేదికగా సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.