AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ అభ్యర్థులు వారి ఓటు వారు వేసుకోలేరు!

లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు తమ ఓటును వారే వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కారణం వారికి ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉండటమే. దీంతో వారు తమ ఓటును ఇతర అభ్యర్థులకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓటు వారి కార్యక్షేతం పాత బస్తీలో లేదు. అసద్ భాయ్ రాజేంద్ర నగర్ పరిధిలో నివాసం ఉంటున్నారు. అంటే చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. చిత్రమేమంటే.. చేవెళ్లలో ఎంఐఎం అభ్యర్థిని నిలపలేదు. దీంతో అసదుద్దీన్ ఓటు కచ్చితంగా వినియోగించుకుంటే అది వేరే పార్టీ అభ్యర్థికేనని స్పష్టమవుతోంది. అలాగే మాధవీ లత ఓటు కంటోన్మెంట్‌ హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఢీ కొడుతున్న బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్ర హిల్స్‌ లో ఉంటున్నారు. ఇది కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం కిందకు వస్తుంది. ఇక ఎంపీ నియోజకవర్గం మాత్రం మల్కాజిగిరి. మాధవీ లత అసెంబ్లీ ఉప ఎన్నికలో కంటోన్మెంట్‌కు, లోక్ సభ ఎన్నికలో మల్కాజిగిరి అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది.

హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్‌కు ఓటు జూబ్లీహిల్స్ లో ఉంది. ఇది సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధికి వస్తుంది. దీంతో సమీర్ తన ఓటును తనకు వేసుకోలేరు. వీరే కాకుండా అటు చేవెళ్లలో ఓటు మల్కాజిగిరిలో పోటీ మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఓటు తాండూరు అసెంబ్లీ పరిధిలో ఉంది. దీంతో సునీత కూడా మరో అభ్యర్థికి ఓటు వేయాల్సిందే. మల్కాజిగిరిలో ఓటు చేవెళ్లలో పోటీ చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు ఓటు వచ్చేసి మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో ఉంది. ఇది కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. దీంతో కాసానికి వేరొక అభ్యర్థికి ఓటు వేయాలి. ఇలా ఈ లోక్‌సభ ఎన్నికల్లో వారి ఓటును వారే వేసుకోలేని పరిస్థితి ఏర్పడం ఆసక్తికరంగా మారింది.

ANN TOP 10