AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు నారాయణపేట, హైదరాబాద్‌లో మోదీ సభలు

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ తెలంగాణకు మరోసారి రానున్నారు. ఒకేరోజు రెండు సభల్లో పాల్గొననున్నారు. దానిలో భాగంగా.. కర్ణాటక నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నాం 3గంటలకు నారాయణపేటకు చేరుకోనున్నారు. నారాయణపేట జూనియర్‌ కళాశాల మైదానంలో మహబూబ్‌నగర్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. మధ్యాహ్నం 3గంటల 15నిమిషాల నుంచి 4గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక.. నారాయణపేట సభ తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌కు చేరుకోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.

హైదరాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలను కలిపి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ సభలో 5గంటల 30నిమిషాల నుంచి 6 గంటల 20నిమిషాల వరకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఎల్బీ స్టేడియంలో సభ ముగించుకుని.. 6గంటల 40నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి భువనేశ్వర్‌కు బయల్ధేరి వెళ్లనన్నారు. ఇక.. ప్రధాని మోదీ చివరి రెండు సభల కోసం బీజేపీ తెలంగాణ నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ANN TOP 10