AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాయమాటలు చెప్పి ఆగం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి

నాడు ఓటుకు నోటు అని, నేడు ఓటుకు ఓట్లు లాగా కాంగ్రెస్ సర్కారు మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో రోడ్ షో లో ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పథకాలు దేవుడు ఎరుగు, ఉన్న పథకాలు ఆగం చేశారన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన కేసీఆర్ పై ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని, ఇది పద్దతి అని ప్రశ్నించారు.చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించి రాష్ట్రానికి సాగు, తాగునీరు, కరెంటు అందించిన కేసీఆర్ ను అవమానించిన రేవంత్ కు బుద్ది చెప్పాలన్నారు.

6 గ్యారంటీల బాండ్ ను బౌన్స్ చేసిన ప్రభుత్వం పై తిరుగుబాటు చేయాలన్నారు.రుణ మాపీ, 6 గ్యారంటీల ను ఆగస్టు 15 లోగా అమలు చేయాలని రేవంత్ కు సవాల్ విసిరితే సమాధానం లేదన్నారు.మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న కరెంటు, నీళ్లు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.నాడు ఓట్లకోసం ప్రమిసరీ నోట్లు వ్రాసి ఇచ్చారని, నేడు ఓట్ల కోసం దేవుళ్ళ మీద ఒట్లు వేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో 2500 కోసం కాంగ్రెస్ వాళ్ళను నిలదీయాలన్నారు. ఋణమాపీ, రైతు భరోసా ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో కరెంటు, నీళ్లు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ అందించారన్నారు.కాంగ్రెస్ కు ఓటు వేయాలంటే వారి అబద్ధాలకు సమర్ధించినట్లే అవుతుందన్నారు.

తెలంగాణ అభివృద్ధి కావాలి అంటే ,వొచ్చిన తెలంగాణను నిలుపు కోవాలి అంటే బీఆర్ఎస్ కు అండగా నిలవాలి.మాయ మాటలు చెప్పే రఘునందన్ కు మరోసారి బుద్ది చెప్పాలన్నారు.ఎడ్లు, రైలుబండి, నిరుద్యోగ భృతి అని మోసం చేసిన రఘునందన్ కు మరోసారి ఓడించాలన్నారు.ప్రజలకు ఏమి చేయని బీజేపీ నాయకులు క్యాలెండర్ లతో తిరుగుతున్నారన్నారు.బీజేపీ మూలంగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచారన్నారు.వడ్లు కొనాలి అంటే బీజేపీ నాయకులు నూకలు బుక్కాలన్న వారికి ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి మీ యువతకు అండగా నిలిస్తామన్న వెంకట్రామరెడ్డికి అండగా నిలవాలన్నారు.జాయింట్ కలెక్టర్ గా పనిచేసినప్పుడు అనాధ పిల్లలు వొస్తే వారిని దత్తత తీసుకొని బాగోగులు చూసుకున్నాడని గుర్తు చేశారు.

ANN TOP 10