ముగిసిన ఎంపీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. నాలుగో దశ ఎన్నికల కోసం నామినేషన్ల గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ల ఘట్టం ముగిసింది. మల్కాజిగిరి ఎంపీ స్థానానికి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో క్యూలో ఉన్న వారికి నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు.
ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 18వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4 ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిరచనున్నారు. ఈసీఐ వెబ్సైట్లో గురువారం 3 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు నామినేషన్ల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్లో 39, భువనగిరిలో 81, చేవెళ్ల 59, మల్కాజిగిరి 101, మెదక్ 55, నాగర్ కర్నూలు 23, నల్లగొండ 85, సికింద్రాబాద్లో 60, పెద్దపల్లి 74, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్కు 38 నామినేషన్లు దాఖలు అయినట్లు సమాచారం.