కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 25న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎల్లుండి సిద్దిపేటలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఆ రోజు ఉదయం 11.10 గంటలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేటలో ఎయిర్ ఫోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సిద్దిపేటకు చేరుకుంటారు. ఆ తర్వాత కారులో బహిరంగ సభ ప్రదేశానికి చేరుకుని అక్కడ బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో కషాయ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి మధ్యాహ్నం 2.15 గంటలకు అమిత్ షా భువనేశ్వర్కు వెళ్లనున్నారు.
