AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో ఘ‌నంగా సీఆర్ఆర్ జ‌యంతి

ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు దివంగత మాజీ మంత్రివర్యులు శ్రీ చిలుకూరి రామచంద్రారెడ్డి జయంతోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా సీఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అయన అందించిన సేవలను మాజీ మున్సిప‌ల్ ఛైర్మ‌న్ దిగంబ‌ర్ రావు పాటిల్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి కొనియాడారు. ఆదిలాబాద్ అంటే రాంచంద్రారెడ్డి, సీఆర్‌ఆర్ అంటే ఆదిలాబాద్ అనేంత‌లా ఇక్క‌డ పేరుతెచ్చుకున్నార‌ని అన్నారు. అలాంటి వ్య‌క్తి మ‌న ఆదిలాబాద్ వాసి కావ‌డం మ‌న అదృష్టమ‌న్నారు. ఆయ‌న అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయాల‌ని సూచించారు. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్య‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10