– సీఎం రేవంత్ ధూంధామే..
– ఏడు రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు
(అమ్మన్యూస్,హైదరాబాద్):
కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యవహరించనున్నారు. ఎన్నికల ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల పీసీసీల నుంచి రేవంత్ కు ఆహ్వానం వచ్చింది. ఇందులో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళతో పాటు తమిళనాడు, బీహార్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది.
నేడు, రేపు కేరళలో రెండు రోజులు రేవంత్ ప్రచారం చేయనున్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ తో పాటు కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజ సెగ్మెంట్లలో క్యాంపెయిన్ చేయనున్నారు. మరో వైపు ఏప్రిల్ 19 నుంచి వచ్చేనెల 11 వరకు రాష్ట్రంలో సీఎం రేవంత్ విస్తృతంగా పర్యటన చేయనున్నారు రేవంత్. 50 సభలు, 15 రోడ్ షోలలో పాల్గొనున్నారు.