అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఈ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మహబూబ్ నగర్2కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఆదిత్య శ్రీవాత్సవకు తొలి ర్యాంకు రాగా, రెండో ర్యాంకు అనిమేష్ ప్రదాన్, అలాగే నాలుగో ర్యాంకు పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, ఐదో ర్యాంకు రుహనీకి వచ్చింది. ఇక విధంగా జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ కోటాలో 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ కేటగిరీ నుంచి 165 మంది, ఎస్టీ నుంచి 86 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్కు 180 మంది, ఐపీఎస్కు 200 మంది, ఐఎఫ్ఎస్కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ – ఏ కేటగిరీకి 613 మంది, గ్రూప్ – బీ కేటగిరీలో 113 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది మే 28న ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. ప్రిలిమినరీ రౌండ్ క్లియర్ చేసిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో రెండు షిఫ్టుల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 8న మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. మెయిన్స్ లో సత్తా చాటిన వారికి జనవరి2 నుండి ఏప్రిల్ 9 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించారు.
