AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నా ఫోన్లు అన్ని ఇచ్చేస్తున్నా: కవిత

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విచారణ నిమిత్తం మూడోసారి ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. తనపై ఇడి తప్పుడు ప్రచారం చేస్తుందని కవిత మండిపడ్డారు.ఈడీ ఆఫీస్‌కు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. గతంలో తాను ఉపయోగించిన ప్రతి ఫోన్లను ఈడీ అధికారులు ఇస్తున్నానని పేర్కొన్నారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. మహిళ గోప్యతకు భంగం కలిగించేలా ఫోన్లు అడిగారని, అయినా కూడా తన ఫోన్లు ఇచ్చేస్తున్నానని చెప్పారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ విచారణలో భాగంగా సోమవారం కవితను పదిన్నర గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 10.30 నుంచి రాత్రి 9.14 గంటల వరకు కవితను ఈడీ అధికారులు విచారించారు.

ANN TOP 10