AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నల్లమల అడవుల్లో మరోసారి కార్చిచ్చు.. దగ్ధమవుతున్న అడవి

హైదరాబాద్‌ : నల్లమల అడవిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆమ్రాబాద్‌ మండలం తాళ్లచెలుక, గుండం ప్రాంతాల్లో సుమారు 100 వంద ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమైనట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి మంటలు అంటుకున్నట్లు తెలిసింది. అటవీ సిబ్బంది, ట్రెక్కింగ్ వెళ్లిన వారు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10