AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెల్లి జైలుకు వెళ్తే.. ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో నీ చిందులు!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటకు వచ్చాక మాజీ మంత్రి కేటీఆర్ మేకపోతు గంభీర్యం ప్రకటిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో కేసీఆర్, కేసీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. నవీన్ రావు, శ్రవణ్ రావు సర్వెంట్ ఎక్విప్ మెంట్ కొనుగోలు చేశారన్నారు. ఈ విషయంలో మీ ప్రమేయం లేకపోతే లైవ్ డీటేక్టర్‌కు వస్తారా అని, దీనిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పదేండ్ల పాలనలో ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశారన్నారు.

శ్రవణ్ రావు, నవీన్ రావు ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తులను బెదిరించి రూ. వందల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై సిట్ వేసి లోతైన దర్యాప్తు చేయాలని కోరారు. ధరణిలో కొన్ని వందల ఎకరాలు నవీన్ రావు పేరుపై బదలాయించారని అన్నారు. నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. చెల్లి కవిత తీహార్ జైలుకు వెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేశారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు కేటీఆర్‌కు లేదన్నారు. అన్ని బాగున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబెర్స్ పోటీ చేయడం కాదని, ఇప్పుడు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ముగ్గురు కుటుంబ సభ్యులు మూడు చోట్ల పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

ANN TOP 10