మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో ‘అమ్మన్యూస్’ టీమ్ భేటీ అయ్యింది. నగరంలో మంగళవారం అమ్మన్యూస్ టీవీ సీఈఓ కంది రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డిని శాలువతో సన్మానించి అమ్మన్యూస్ మెమెంటోను అందజేశారు. సంచలన కథనాలు, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రజల్లో విశేష ఆదరణ పొందిన ‘అమ్మన్యూస్ టీవీ’ గురించి ఈ సందర్భంగా చైర్మన్కు సీఈఓ వివరించారు. ఈ కార్యక్రమంలో అమ్మన్యూస్ బ్యూరో చీఫ్ గడ్డం కృష్ణమూర్తి, మేనేజర్ అరవింద్రెడ్డి, అవుట్ పుట్, ఇన్పుట్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.