మళ్లీ సోదాలకు రంగం సిద్ధం
నేడో రేపో తెలంగాణకు ఈడీ అధికారులు
నిజామాబాద్పై ఫుల్ ఫోకస్
(అమ్మన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్):
ఢిల్లీ ల్లిక్కర్ కేసుపై విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగిరం చేసింది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పూర్తి స్థాయిలో విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. లెక్కలు తేల్చాల్సిందేనని అధికారులు గట్టిగానే ఉన్నారు. ఇప్పటికే ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్.. కస్టడీ.. మళ్లీ సోదాలు ఇలా వరుస షాకులిచ్చిన అధికారులు త్వరలో మరో కీలక పరిణామంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది.. ఇప్పటి వరకూ హైదరాబాద్ వేదికగా కవిత ఇంట్లో, బంధువుల ఇళ్లలో వరుస సోదాలు నిర్వహించిన ఈడీ.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడం, కస్టడీలో జరిగిన విచారణలోనూ కీలక సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. తవ్వేకొద్దీ కవితకు సంబంధించిన లింకులన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందుకే ఇక మరింత స్పీడ్ పెంచి నిజామాబాద్పై ఈడీ ఫోకస్ పెట్టిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
లెక్కలు తీస్తున్నారు..!
నిజామాబాద్లో కవితకు ఉన్న ఆస్తులెన్ని..? ఏయే వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు..? కవిత బినామీలు ఎవరు..? ఇలా అన్ని కోణాల్లోనూ ఈడీ సోదాలు జరపబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే.. ఈ మధ్య జరిగిన సోదాలతో నిజామాబాద్కు లింకులు ఉన్నాయని తెలియవచ్చింది. దీంతో కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తవ్వగానే.. కవితకు ఎక్కడెక్కడ వ్యాపారాలు ఉన్నాయని ఆరా తీసేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందట. అంతేకాదు.. కవిత భర్త, బంధువులు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సైతం వెలికితీస్తున్నారు. ఇప్పటికే కవిత మేనల్లుడు మేక శరణ్ పేరు తెరపైకి రావడం.. విచారణలో అతనెవరు అని అడిగితే ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈడీ అధికారులకు మరిన్ని సందేహాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మళ్లీ సోదాలు షురూ చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారట. మొత్తానికి చూస్తే.. కవిత త్వరలోనే మరో రaలక్ తగలనుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.