AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చైనాలో ఘోర బస్సు ప్రమాదం.. 14 మంది మృతి

చైనా (China)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) సంభవించింది. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌ (Shanxi province)లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ (expressway tunnel) ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో పది మందికి పైగా మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.

స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. హుబేయ్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 51 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టన్నెల్‌ ఇంటీరియర్‌ వాల్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 37 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10