AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేశామని ప్రకటనలో ఈడీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అరెస్ట్ చేసిన సమయంలో బంధువులు ఇబ్బందులు కలిగించారని తెలిపింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు వెల్లడించగా.. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని స్పష్టం చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది. కోర్టు అనుమతి తీసుకుని తాము కవితను విచారిస్తున్నామని తెలిపింది. వంద కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు వందల కోట్ల చెల్లింపులో కవితది కీలక పాత్ర అని పేర్కొంది.

ఇప్పటి వరకు 240 చోట్ల సోదాలు చేశామని, 5 సప్లిమెంటరీ చార్జిషీట్లు దాఖలు చేశామని తెలిపింది. సోదాల్లో రూ.128 కోట్ల ఆస్తులను గుర్తించామని తెలిపింది. మనీశ్ సిసోడియా సహా పలువురితో కవితకు లింకులు ఉన్నట్లు వెల్లడైందని పేర్కొంది. అదే విధంగా ఆప్ నేతలకు రూ. 100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవితది కీలక పాత్ర అని ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 240 చోట్ల సోదాలు చేసి.. 5 సప్లిమెంటరీ చార్జ్ షీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. 128 కోట్ల ఆస్తులను గుర్తించి సీజ్ చేశామని పేర్కొంది. లిక్కర్ కేసులో కవితతో పాటు ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది.

ANN TOP 10