ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ (TDP) దాదాపు చేరిపోయినట్టే. హస్తిన వేదికగా గురువారం నాడు.. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ల మధ్య జరిగిన కీలక భేటీలో చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది…
ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంపై మంతనాలు
సీట్ల సర్దుబాటు అంశంపై బీజేపీ నాయకత్వంతో చర్చ
బీజేపీకి 4 లోక్సభ, 6 అసెంబ్లీ స్థానాలను ఆఫర్ చేసిన టీడీపీ
6 లోక్సభ,10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్న బీజేపీ