అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖపై అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి సీతక్క, సీఎస్ శాంత కుమారి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్ వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. కేంద్రాలకు సొంత భవనాలపై దృష్టి సారించాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలని సూచించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేగాకుండా.. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెట్టాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలని తెలిపారు.
