హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం నుంచి క్రమక్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రేపట్నుంచి ఎండలు మరింత దంచికొట్టే అవకాశం ఉంది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. మార్చి రెండో వారంలో ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు, మరో వైపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
