మేడారం: నేడు మేడారం (Medaram) నుంచి హుండీలను హన్మకొండ (Hanamkonda)కు తరలించనున్నారు. హన్మకొండలోని టీటీడీ (TTD) కల్యాణ మండపానికి తరలించి అక్కడ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు లెక్కించనున్నారు. 29 నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం కానుంది. మేడారం మహాజాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. హుండీల లెక్కింపునకు కసరత్తు ప్రారంభం కానుంది. పది రోజుల పాటు లెక్కింపు కొనసాగనుంది.









