AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సమ్మక్క, సారలమ్మ పరాక్రమం గుర్తు చేసుకుందాం అంటూ ప్రధాని మోడీ శుభాకాంక్షలు..

నేటి నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సోషల్‌ మీడియా వేదికగా భక్తులకు శుభాకాంక్షలు చెప్పారు. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటైన మేడారం జాతర మన సాంస్కృతిక వారస్వతానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అని చెప్పారు. అంతేకాదు ఈ సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవ వేళ భక్తులకు శుభాకాంక్షలని అన్నారు. ఈ జాతర భక్తి సంప్రదాయం. సమాజ స్ఫూర్తికి గొప్ప కలయిక అని చెప్పారు నరేంద్ర మోదీ. వనదేవతలైన సమ్మక్క సారలక్కలకు ప్రణమిల్లుదాం అని ప్రధాని మోదీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. వారి ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందామని పిలుపునిచ్చారు.

ANN TOP 10