AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మూసీ క్లినింగ్ ప్రక్రియ పూర్తి చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మూసీ న‌ది క్లీనింగ్ ప్ర‌క్రియ‌ను ముందుగా పూర్తి చేయాల‌ని అధికారులను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో సీఎం అధికారులతో సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారులు మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్‌తో పాటు పలు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక చేయాలని అధికారులకు తెలియజేశారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని, అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు దానకిశోర్, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10