AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో నాలుగు రోజులు వానలు..

దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్‌ వరకు ఉన్న ద్రోణి తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో మరో 4 రోజులపాటు రాష్ర్టానికి వర్షసూచన ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భధ్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్‌, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతోకూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10