అమ్మన్యూస్, మణుగూరు: తల్లి జ్ఞాపకార్థం కూతురు దాతృత్వం చాటారు. సింగరేణి కాలరీస్ మణుగూరు ఓసీ గనిలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న దాసరి రజనీ తన మాతృమూర్తి సరోజినీ జ్ఞాపకార్థం స్థానిక సంతోష్నగర్లోని శ్రీవిద్యాభ్యాస (బాల వెలుగు) పాఠశాలకు 50 కేజీల బియ్యాన్ని వితరణగా అందజేశారు. విద్యార్థిని విద్యార్థులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా మాట్లాడుతూ తల్లి జ్ఞాపకార్థం విద్యార్థుల చదువుకు సహకారం అందిస్తున్న రజినీ సేవాగుణాన్ని అభినందించారు. దాతల ప్రోత్సాహంతో విద్యార్థినీ విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరారు, అనంతరం విద్యార్థులకు స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మచ్చ శ్రీనివాస్, చొప్పరి శ్రీలేఖ, బత్తుల జ్యోతి, ఆరే దివ్య, మంగిలాల్, సుహాసిని దేవి, రాధ తదితరులు పాల్గొన్నారు.










