AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డివైడర్‌పై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

యాదాద్రి భువనగిరి : ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి డివైడర్‌(Divider)పై దూసుకుపోయింది. ఈ సంఘటన ఆలేరు( Aleru)లోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై గల కందిగడ్డ తండా శివారులో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ పై దూసుకుపోయింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా కొద్ది మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించి ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ANN TOP 10