భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా చేస్తారని, కేసీఆర్ కుట్రల వల్ల ఏమైనా జరగొచ్చునని అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి.. బీజేపీ మీద నెట్టివేస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ను కాంగ్రెస్ ముందు బొంద పెట్టాలన్నారు. బీజేసీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే జనం నమ్మరని, కాంగ్రెస్ గుడ్డి ఆలోచనలోనే ఉందన్నారు.
ముందు కేసీఆర్ సంగతి చూడాలని, కాంగ్రెస్, బీజేపీ గట్టిగా కొట్లాడితే.. ఇంకోడు బయటపడే అవకాశం ఉందని బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొండి పట్టుకు పోవద్దని సూచించారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని, ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన తమకు లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.









