AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీహెచ్‌ఎంసీకి జాతీయ అవార్డు.. పారిశుధ్య నిర్వహణలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో జీహెచ్‌ఎంసీ జాతీయ అవార్డును అందుకోనుంది. పారిశుధ్య నిర్వహణలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ సాధించినట్లు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ రోనాల్డ్‌రోస్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 11న న్యూఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదాన కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపింది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో పారిశుధ్య నిర్వహణ విభాగంలో లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను (నేషనల్‌ ర్యాంకింగ్‌), లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలను (స్టేట్‌ అండ్‌ జోనల్‌ ర్యాంకింగ్‌)లో ఎంపిక చేస్తారు. ఈ మేరకు 2023 డిసెంబర్‌ 23 నుంచి పది రోజులపాటు స్వచ్ఛ సరేక్షణ్‌ బృందాలు ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీని జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసినట్లు మేయర్‌, కమిషనర్‌ తెలిపారు. ఇప్పటి వరకు త్రీస్టార్‌ ర్యాంకింగ్‌ ఉండగా, తాజా అవార్డుతో నగరానికి ఫైవ్‌ స్టార్‌ ర్యాంకింగ్‌ రానుందని తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10