AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేపర్‌ లీకేజీపై న్యాయవిచారణ జరపాల్సిందే

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

హైదరాబాద్‌: ఇది లీకేజీ, ప్యాకేజీ, నిరుద్యోగుల డ్యామేజీ ప్రభుత్వమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. మంగళవారం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. గ్రూప్‌1తో సహా టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ లీకయ్యాయని, లీక్‌ చేసిన నిందితుడు ప్రవీణ్‌కు అత్యధిక మార్కులా? అని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యులను తొలిగించాలని డిమాండ్‌ చేశారు. రెండు నెలల్లో జరిగే పరీక్షల పేపర్లు కొందరికి లీకయ్యాయని, సింగరేణి పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాని ఆరోపణలు చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై న్యాయ విచారణ జరిపాలని డిమాండ్‌ చేశారు.

ANN TOP 10