AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నగర ప్రయాణికులకు అలెర్ట్‌.. 29 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు..!

హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్‌ను జారీ చేసింది. వివిధ మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. పలు ఆపరేషనల్‌ కారణాలతో ఆయా రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని కోరింది. రద్దయిన రైళ్లలో లింగంపల్లి-ఉందానగర్‌ (47213), ఉందానగర్‌-లింగంపల్లి (47211), లింగంపల్లి ఉందానగర్‌ (47212), ఉందానగర్‌-సికింద్రాబాద్‌ (47246), సికింద్రాబాద్‌-ఉందానగర్‌ (47247), ఉందానగర్‌-సికింద్రాబాద్‌ (47248), ఉందానగర్‌- సికింద్రాబాద్‌ (47248), సికింద్రాబాద్‌-ఉందానగర్‌ (47249), ఉందానగర్‌-లింగంపల్లి (47160), లింగంపల్లి-ఫలక్‌నుమా (47188), ఫలక్‌నుమా-లింగంపల్లి (47167), లింగంపల్లి – ఉందానగర్‌ (47194), లింగంపల్లి – ఉందానగర్‌ (47173) రైళ్లను రద్దు చేసినట్లు చెప్పింది. వీటితో పాటు రామచంద్రపురం – ఫలక్‌నుమా, మేడ్చల్ – సికింద్రాబాద్, ఫలక్‌నుమా – హైదరాబాద్‌, ఫలక్‌నుమా – హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి తదితర రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

ANN TOP 10