తెలంగాణలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. రాజకీయంగా పలు కీలక మార్పులు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హైకమాండ్ నిర్ణయం మేరకు ఉమ్మడి పది జిల్లాకు ఇన్చార్జ్ మంత్రులను సీఎం రేవంత్రెడ్డి నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇన్చార్జ్ మంత్రుల జాబితాను ప్రకటించింది.
– కరీంగనర్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమర్రెడ్డి
– మహబూబ్నగర్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా దామోదరం రాజనర్సింహ
– ఖమ్మం జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా కోమటిరెడ్డి వెంటకరెడ్డి
– వరంగల్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
– హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్
– మెదక్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా కొండా సురేఖ
– ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ధనసరి అనసూయ (సీతక్క)
– నల్గొండ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు
– నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు
– రంగారెడ్డి జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా శ్రీధర్బాబును నియమించారు
