AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. వైసీపీలో భారీ మార్పులు

భారీగా అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పులకు వైసీపీ సిద్ధమైంది. ఇప్పటికే 11మంది ఇన్‌చార్జులను ప్రకటించిన వైసీపీ.. మొత్తం 62 చోట్ల ఇన్‌చార్జులను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇక, 30మందికిపైగా సిట్టింగ్ లకు ఈసారి టికెట్లు నిరాకరించే పరిస్థితి కనిపిస్తోంది. కొంతమందిని పార్లమెంటు నుంచి పోటీ చేయించే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి ఒంగోలు, గుంటూరు జిల్లాలలో మార్పులు చేసిన వైసీపీ రేపు(డిసెంబర్ 12) మరో ఉమ్మడి జిల్లాలో మార్పులు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల్లో శ్రేణులను విజయవంతంగా నడిపించడం.. ఈ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని, ఆ మేరకు సామర్థ్యం ఉన్న వారిని ఇంఛార్జిలుగా జగన్ నియమిస్తున్నట్లు సమాచారం.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలో వైసీపీలో భారీ మార్పులకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కచ్చితంగా పార్టీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని భావించారు జగన్. ఇటీవలే చేసిన కొన్ని సర్వేల నేపథ్యంలో పార్టీలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగానే మొత్తం 62 చోట్ల ఇన్‌చార్జులను మార్చాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మొదటి విడతలో 11 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులను మార్పులు చేశారు. ఈ 11 నియోజకవర్గాల్లో మొత్తం నలుగురికి సంబంధించి స్థాన చలనం కలిగించారు. మొత్తం ముగ్గురికి టికెట్ లేదని కన్ ఫర్మ్ చేసేశారు. మిగిలిన చోట్ల కొత్త ఇంఛార్జ్ లను నియమించారు. తొలి విడతలో భాగంగా 11మందికి సంబంధించి మార్పులు చేయగా, రానున్న రోజుల్లో విడతల వారిగా ఈ మార్పులు ఉండబోతున్నాయి. మొత్తం 62 నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ ల మార్పులు కచ్చితంగా ఉండబోతున్నాయని సమాచారం.

ఇక 30 మందికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థాన చలనం ఉంటుంది. ప్రకటించిన 11మంది లిస్టులో స్థాన చలనం కల్పించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో నలుగురికి వేర్వేరు స్థానాల్లో అవకాశం కల్పించారు. ఇలా 62 మార్పుల్లో 30మందికి పైగా స్థానచలనం కలిగించే అవకాశం ఉంది. మరో 30మందికి దాకా టికెట్ పూర్తిగా లేనట్లుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.

ఎవరికైతే టికెట్ లేదని నిర్ణయానికి వచ్చారో వారితో అధిష్టానం పెద్దలు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నిన్న(డిసెంబర్ 10) సాయంత్రమే సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన లేక మంత్రులుగా ఉన్న కొందరిని పార్లమెంటుకు పంపే ఆలోచనను వైసీపీ అధిష్టానం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరిని పార్లమెంటుకు కూడా పంపించాలనేది సీఎం జగన్ నిర్ణయంగా తెలుస్తోంది. అలాగే పార్లమెంటు ఎంపీలుగా ఉన్న కొందరిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిల మార్పు..

నియోజకవర్గం – ఇంఛార్జి పేరు

1. ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్
2. కొండేపి- ఆదిమూలపు సురేశ్
3. వేమూరు- వరికూటి అశోక్ బాబు
4. తాడికొండ- మేకతోటి సుచరిత
5. సంతనూతలపాడు- మేరుగు నాగార్జున
6. చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు
7. గుంటూరు (వెస్ట్)- విడదల రజని
8. అద్దంకి- పాణెం హనిమిరెడ్డి
9. మంగళగిరి- గంజి చిరంజీవి
10. రేపల్లె- ఈవూరు గణేశ్
11. గాజువాక- వరికూటి రామచంద్రరావు

ANN TOP 10