AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అప్పుడే మొదలుపెట్టారా?.. హరీశ్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్

మాజీ మంత్రి హరీశ్ రావుకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు నిర్వహించిన అసెంబ్లీ సమావేశం అనంతరం.. మీడియా పాయింట్‌ దగ్గర మాట్లాడిన హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలు డిమాండ్లు చేశారు. కాగా.. హరీశ్ రావు వ్యాఖ్యలపై సీతక్క స్పందించారు. ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు కూడా గడవలేదని.. అప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదమన్నారు సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వమని.. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని సీతక్క సమాధానమిచ్చారు.

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అసలు బోనసే ఇవ్వలేదని.. సీతక్క తెలిపారు. వడ్ల కొనుగోళ్లలో రైతులను తీవ్రంగా మోసం చేశారని ఆరోపించారు. క్వింటాల్‌ ధాన్యంలో సుమారు 10 కిలోలు తీసేసి.. రైతులను చాలా ఇబ్బంది పెట్టారని గుర్తుచేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి చేయలేదన్నారు. రైతుబంధు ద్వారా వందల ఎకరాలు ఉన్న భూస్వాములే లబ్ది పొందారని సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేల కోట్లు అప్పులు చేసి.. పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని దర్జాగా బతికారంటూ ఆరోపించారు. ఇప్పుడేమమో.. పెద్ద పెద్ద ఫాంహౌస్‌ల ఓనర్లు, మాజీ మంత్రులు.. రైతుబంధు రాలేదని బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి.. సమీక్షించిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తామని సీతక్క స్పష్టం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10